Header Banner

ఆ వ్యాఖ్యలకు జగన్, భారతిరెడ్డి బాధ్యత వహించాలి! విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డుల ప్రదానం..

  Mon Jun 09, 2025 16:29        Politics

రాజధానికి 30వేల ఎకరాలను కావాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్.. వైకాపా అధికారంలోకి వచ్చాక అమరావతిపై దుష్ప్రచారం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాజధానికి తమ విలువైన భూములు త్యాగం చేసిన రైతుల కుటుంబాలను, మహిళలను కించపరిచేలా మాట్లాడటం శోచనీయమని అన్నారు. రాజమహేంద్రవరంలో మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. "సాక్షి డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలకు వంతపాడిన కొమ్మినేని శ్రీనివాస్ కూడా శిక్షార్హులు. మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన సాక్షి ఛానల్, వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలు సిగ్గుతో తలదించుకునేలా సాక్షి మీడియాలో వార్తలు ప్రసారం చేస్తున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావును మేం జర్నలిస్టుగా పరిగణించం.

 

ఇది కూడా చదవండి: అన్ని నియోజవర్గాల్లో ఎంఎస్ఎంఈల ఏర్పాటు! దీపం-2 కింద ఏడాదికి..

 

ఇంత జరిగినా జగన్, భారతిరెడ్డి కనీసం క్షమాపణ చెప్పకపోవడం దారుణం. జగన్, భారతి రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ప్రజలు వీరిద్దరిని క్షమించరు"అని మంత్రి నిమ్మల అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పది, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రాజమహేంద్రవరంలో షైనింగ్ స్టార్ అవార్డులు ప్రదానం చేశారు. ఇంఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి కందుల దుర్గేశ్ విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ రూ.15వేల చొప్పున తల్లికి వందనం అందిస్తామని చెప్పారు. గతంలో ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీలు తక్కువగా ఉంటే ఒకే ఏడాదిలో 300 ఇంజినీరింగ్ కాలేజీలను చంద్రబాబు ప్రారంభించారని గుర్తు చేశారు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NimmalaRamanaidu #AndhraPradesh #APpolitics #APNews #PressMeet #Jagan #CommentsOnjagan #JaganWife #Ycp #TDPleaders